స్పెషల్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు స్పెషల్ కేటగిరి భద్రత కల్పించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న దాడులు నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు రెక్కీ నిర్వహించడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకొని స్పెషల్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకి పెరుగుతున్న ఆదరణ చూసి కొందరు దుండగులు ఇలాంటి నీచ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏదైనా ఉంటే రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యంగా తేల్చుకోవాలి కానీ ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగాచారి, ల్యాబ్ శ్రీను, మచ్చ పవన్ కళ్యాణ్, దాసరి వాసు తదితరులు పాల్గొన్నారు.