ఆశా కార్యకర్తల డిమాండ్స్ తక్షణమే తీర్చాలి: దారం అనిత

ప్రభుత్వానికి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించే వారిలో “ఆశా కార్యకర్తలు” ముందుంటారు. మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కూడా వీరి సేవలు ప్రజలకు చక్కగా ఉపయోగపడుతున్నాయి. కానీ వీరికి జీతాల విషయాల్లో మాత్రం ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది. సంక్షేమ పథకాలు, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని, ఏఎన్ఎంల ఖాళీల భర్తీలో ఆశా కార్యకర్తలకు వెయిటేజీ ఇవ్వాలని, కరోనాతో మరణించిన వారి కుటుం బాలకు రూ. పది లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అనేక మార్గాల్లో ఉపయోగపడుతున్న “ఆశా కార్యకర్తల” డిమాండ్స్ తక్షణమే ప్రభుత్వం తీర్చాలని జనసేన పార్టీ తరపున మదనపల్లె, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేసారు.

ఆశాకార్యకర్తలు #JusticeForAshaWorkers