దేశపాత్రునిపాలెం గ్రామం లో జనసేన ప్లకార్డుల ప్రదర్శన

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన చేపట్టిన డిజిటల్ క్యాపెయిన్ కు జనసైనికులు మద్దతు తెలిపారు. దేశపాత్రునిపాలెం గ్రామంలో సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గొరపల్లి రవికుమార్, గొరపల్లి చినబాబు మాట్లాడుతూ చట్టసభల్లో పోరాడితేనే ఫలితం దక్కుతుందన్నారు. రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ లో మన గళం వినిపించాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ మన సెంటి మెంట్ తో కూడిన విషయమని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని జనసైనికులంతా ట్విట్టర్ ద్వారా పార్లమెంట్ సభ్యులకు ప్రజల వినతి అందించినట్టు వివరించారు. కార్యక్రమంలో జనసేన పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మల్లువలస శ్రీను, పంచాయతీ వార్డు సభ్యులు గొరపల్లి అమ్మాజీ వెంకటరావు, కొత్తవలస మండల నాయకులు బోని రామ గణేష్, మళ్ల రాజు, వీర మహిళ గొరపల్లి వరలక్ష్మి, నాయకులు కోట్ని గోవింద, గొర్లె శ్రీనివాస్, ఇల్లపు సంతోష్ పాల్గొన్నారు.