వీఆర్వోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి: రావిచర్ల జనసేన

అక్రమాలకు పాల్పడుతున్న పాత రావిచర్ల గ్రామం వీఆర్వోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. జనసేన ఆధ్వర్యంలో.. నూజివీడు తహసీల్దార్ కార్యాలయం డిప్యూటీ తహసీల్దారు సింగ్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, పాత రావిచర్ల జనసైనికుడు తోట బలరాం, నూజివీడు పట్టణ జనసేన నాయకులు ఏనుగుల చక్రి, ఆగిరిపల్లి మండలం వైస్ ప్రెసిడెంట్ ముక్కు మహేష్ తదితరులు పాల్గొన్నారు.