డిజిటల్ క్యాంపెయిన్ లో దేవరపల్లి జనసైనికులు

*ఏళ్ళు గడుస్తున్నా నిర్మాణానికి నోచుకోని లక్ష్మీపురం, పల్లంట్ల, కురుకూరు రోడ్డు


దేవరపల్లి మండలం, గోపాలపురం నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్ లోని రోడ్డు దుస్థితిపై #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన డిజిటల్ క్యాంపైన్ లోని భాగంగా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలోని లక్ష్మీపురం, పల్లంట్ల, కురుకూరు రోడ్డు నిర్మాణానికి ఆ గ్రామల జనసైనికులు తమ నిరసన తెలియచేశారు. ఉన్న రోడ్డులో క్వారీ లారీలు తిరగడం వల్ల చాలా దారుణంగా రోడ్డు తయ్యారయ్యిందని.. ఆ రోడ్డులో ప్రయానం నరకప్రాయంగా మారిందని, వర్షాకాలం వస్తే మా బాధ వర్ణనాతీతం అని ఆ గ్రామాల జనసైనికులు వివరించారు. గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేస్తున్న గడప గడప కార్యక్రమం ఈ రోడ్డు నుండి వచ్చి మొదలు పెట్టవలసిందిగా జనసైనికులు డిమాండ్ చేశారు.