“ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” 38వ రోజు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఇస్కపాలెం గ్రామంలో “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” 38వ రోజు జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలోని, ఇస్కపాలెం గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు “గాజుగ్లాస్” కి ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి, పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా దీవించండి అని తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాపు సంక్షేమ సేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పూసల లక్ష్మీ మల్లేశ్వర్ రావు పాల్గొని కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. నీళ్ల విష్ణు, తాండ్ర శ్రీను, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.