అక్టోబర్ 29వ తేదీన ధరణి పోర్టల్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదుచేసే కార్యక్రమం ధరణి పోర్టల్ ఈ నెల(అక్టోబర్) 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభం చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించగా.. దసరాకు రెండు రోజులు సమయం మాత్రమే ఉండడం.. ఇంతవరకు ప్రజల ఆస్తుల నమోదు కార్యక్రమం పూర్తిగా సిద్ధం కాకపోవడం మరియు అకాల వర్షాలు కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో వరదలు రావడంతో.. ఆస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలోనే దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలనే నిర్ణయం కాస్త ఆలస్యం అయ్యింది.