పవన్ కళ్యాణ్ ని విమర్శంచే స్ధాయి డైమండ్ బాబుకి లేదు

• జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య

గుంటూరు సిటీ, వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు, కౌలు రైతులు పండించిన పంట కొరకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొని అండగా నిలుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని చూసి ఓర్చుకోలేక వైసిపి నాయకులు చేస్తున్న చౌకబారు విమర్శలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య అన్నారు.

• పవన్ కల్యాణ్ ని విమర్శించే స్ధాయి డైమండ్ బాబుకి లేదన్నారు.
• నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ ని విమర్శించే ముందు సీఎం జగన్ కు తన డిప్యూటి మేయర్ పదవి కోసం డైమండ్ బాబు ఎంత ప్యాకేజీ ఇచ్చారో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.
• సంవత్సరం తర్వాత తన డిప్యూటీ మేయర్ పదవి ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయంలో ఉన్న డైమండ్ బాబు కూడా పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

వైసీపీ నాయకులు ఇప్పటికైనా పసలేని ఆరోపణలను ఆపి ఈ రాష్ట్రం అప్పులు ఆంధ్రప్రదేశ్ కాకుండా వీలైనంత త్వరగా ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వెంకట రత్తయ్య అన్నారు.