శ్రీశ్రీశ్రీ కోట దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలలో 250 లీటర్ల మజ్జిగ పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, ఆదివారం దసరా నవరాత్రులు సందర్భంగా శ్రీశ్రీశ్రీ కోట దుర్గమ్మ దర్శనానికి వస్తున్న వందలాది భక్తులకు 250 లీటర్ల మజ్జిగను పాలకొండ జనసేన పార్టీ తరఫున పంపిణీ చేయడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను సేవా భావాలను ముందుకు తీసుకెళ్లడంలో పాలకొండ జనసేన పార్టీ ముందుంటుందని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయుకులు గొర్ల మన్మధరావు, ప్రశాంత్ పోరెడ్డి, పొట్నూర్ రమేష్, జామి అనిల్, షేక్ ఆజాద్, వారాడ సతీష్, లోకేష్, ఉమా, దుర్గారావు, ప్రసాద్ శ్రీకాంత్, భాను, ప్రేవీన్, నగేష్, జనసైనికులు పాల్గొన్నారు.