జనసేన వనరక్షణలో 800 కొబ్బరి మొక్కల పంపిణీ

  • జనం కోసం జనసేన582వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన582వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం గురువారం గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 11300 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 583వ రోజు కార్యక్రమాన్ని శుక్రవారం గండేపల్లి మండలం, గండేపల్లి గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. గురువారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, జగ్గంపేట మండల కార్యదర్శి సింగం శ్రీను, గండేపల్లి నుండి దెయ్యాల రమేష్, పెరారపు ప్రసాద్, బుర్ర వీరేంద్ర, దాసరి మణికంఠ, కక్కల శ్రీను, గరగిపాటి ఉమేష్, ఆళ్ల మణికంఠ, కట్టుమోతు సత్యనారాయణ, ముప్పిడి మనోజ్, పెరారపు వెంకన్నబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజులకు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలిపారు.