జనసేన పార్టీ ప్రమాద బీమాచెక్ పంపిణీ

పాలకొండ నియోజకవర్గం: పాలకొండ మండలం, పొట్లి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న బెజ్జిపురం శ్రీనివాసరావు 5 నెలలు క్రితం యాక్సిడెంట్ కి గురవడంతో శ్రీనివాసరావు జనసేన సభ్యత్వం తీసుకోవడం వలన శ్రీనివాసరావుకు ప్రమాద బీమాచెక్ రావడం జరిగింది. ఆదివారం పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు, కోరంగి నాగేశ్వరరావు చేతుల మీదుగా భీమాచెక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోట్లి జనసేన నాయకుడు శంభాన రాధాకృష్ణ, రఘుమండల ప్రసాద్, మిడతాన ప్రసాద్, గర్భాపు నరేంద్ర, డొంపాక సాయికుమార్, జామి రాంబాబు, మాదాసి సంతోష్ కుమార్, జనసైనికులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.