కోడుమూరులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కోడుమూరు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం కోడుమూరు నియోజకవర్గంలో గురువారం ఆకెపోగు రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు కర్నూలు మండల, గూడూరు మండలాల జనసైనికులకు సభ్యత్వ కిట్లు అందించడం జరిగింది.