మనుబోలులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

సర్వేపల్లి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం మనుబోలులో మంగళవారం నిర్వహించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న వారికి కిట్లు పంపిణీ చేసి ప్రయోజనాలు కార్యకర్తలకు భరోసా, భద్రత, భవిష్యత్తును కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రతి కార్యకర్తని తన కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు భావిస్తారని, దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కేవలం 500 రూపాయలతో సభ్యత్వం పొందితే కార్యకర్తలకు 5లక్షల రూపాయల ప్రమాద బీమా మరియు 50వేల రూపాయల ఆసుపత్రి ఖర్చులు వర్తించేలా క్రియాశీలక సభ్యత్వ నమోదును రూపొందించారని వివరించడం జరిగింది. కుటుంబానికి భవిష్యత్తు భరోసా ఇస్తుందని ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రమాదాలు రీత్యా ఇది ఒక మంచి ఆలోచనగా సభ్యులు సైతం ఆనందాన్ని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, ఖాదర్ వళ్ళీ, జాకీర్, సురేష్, కోటి, వినోద్, పోలయ్య, హేమంత్, ఉదయ్, మస్తాన్, శ్రీనివాస్, ముని, శ్రీను, పి మస్తాన్, భరత్, జలీల్, మరియు జనసేన అభిమానులు పాల్గొన్నారు.