నకరికల్లులో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణీ

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, నకరికల్లు గ్రామంలో శనివారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నకరికల్లు మండల ఉపాధ్యక్షుడు బత్తిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నకరికల్లు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి సభ్యత్వ కిట్లు అందజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కార్యదర్శి తిరుమల శెట్టి మల్లేశ్వరి మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారి గొప్ప ఆలోచనా విధానానికి నిదర్శనమని పార్టీ నాయకులు తెలియజేశారు. జనసేన పార్టీ సభ్యత్వం పొందడం అంటే జనాన్ని దోచుకునే అవినీతి పరమైన మరియు అనైతిక రాజకీయాలకు అతీతంగా నిజమైన జనసేవకు కంకణం కట్టుకోవడమే. పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేపట్టాలని ప్రభుత్వం అడ్డగోలుగా జీవోలు పాస్ చేస్తుందని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్ని జీవోలు తీసుకొని వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీ కార్యకర్తలను ఏమీ చేయలేదని రానున్న రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్ద దించటం జనసేన పార్టీకే సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి మణికంఠ, తిరుమల శెట్టి సాంబశివరావు, బత్తిన సుబ్బారావు, చిరతన రామాంజనేయులు, రుసుం సైదులు, గోపిశెట్టి వెంకట నరసయ్య, మొగిలి నరసింహారావు, రుసుం రామయ్య, గాసి అప్పారావు హర్ష పాల్గొన్నారు.