పాలకొండలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

మన్యం జిల్లా, పార్వతీపురం పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, కిమ్మి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్టులు పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ జనసేన పార్టీ కేవలం జనం కోసమే మాత్రమే, ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కనుక ఎంతలా అంటే పార్టీ అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ యం యల్ ఏ కాకపోయినా కనీసం పార్టీలో ఒక్క యం యల్ ఏ లేకపోయినా నిత్యం ప్రజలు కోసం పని చేస్తున్న నాయుకులు పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు 3వేల మంది మరణించితే ప్రభుత్వం పట్టించుకోకపోయినా సరే పవన్ కళ్యాణ్ ఒకొక్క రైతుకి లక్ష రూపాయిలు చొప్పున 30కోట్ల రూపాయిలు తన సొంత డబ్బులు ఇచ్చారు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రధాన రహదారులు ఎక్కడ గోతులు అక్కడే ఉండిపోయి రోడ్ లు అభివృద్ధి చెయ్యకపోవడం వల్లనే ప్రమాదాలు జరిగి మరణించే కుటుంబాలుకి 5 లక్షలు రూపాయిలు తన కష్టార్జీతం పంచిపెట్టే గొప్ప సేవకుడు పవన్ కళ్యాణ్ అని గతంలో మీ ఊరు కిమ్మిలో రెడ్డి గోవిందా అనే వ్యక్తి ఒక్కరు రోడ్ ప్రమాదంలో లో చనిపోతే పవన్ కళ్యాణ్ చేతులు మీదగా ఆ కుటుంబానికి 5 లక్షలు రూపాయిలు చెక్ ఇవ్వడం జరిగింది. అంటే అంత కన్నా గొప్ప నాయుకుడు ఇంకా ఎవ్వరు ఉంటారు కనుక జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా పాలకొండ నియోజకవర్గంలో ఎవ్వరికి టికెట్ ఇచ్చిన సరే ఇక్కడ యం యల్ ఏ అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి 2024 లో వైసీపీ ఇంటికి పంపించే విధంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ నాయుకులు కార్యకర్తలు జనసైనికులు వీరమహిళలు సిద్ధంగా ఉండాలి అని జనసేన జానీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిమ్మి గ్రామ జనసేన నాయుకులు రౌతు గోవిందా, అలుజు శ్రీనివాసరావు, గుండెల రవికుమార్, ఆలుబిల్లి సతీష్, శివ్వాల విక్రం, శ్రీను మహేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.