పెనుగొండ మండలంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పెనుగొండ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం.. క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ మండలంలో మంగళవారం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ప్రియాసౌజన్య, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, వీరవాసరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుండా రామకృష్ణ ముఖ్య అతిధులుగా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పెనుగొండ మండల అధ్యక్షులు కంబాల బాబులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగొండ గ్రామ పార్టీ అధ్యక్షులు యర్రంశెట్టి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంగళ దాసు దానయ్య, ఆచంట మండలం పార్టీ అధ్యక్షులు జవ్వాది బాలాజీ, పోడూరు మండల అధ్యక్షులు గుడాల రాజేష్, పెనుమంట్ర మండల అధ్యక్షులు కోయ వెంకట కార్తీక్, జిల్లా సెక్రెటరీ చిటూరి శ్రీనివాస్, మరో జిల్లా సెక్రెటరీ అడ్డాల దుర్గ, పార్టీ జాయింట్ సెక్రెటరీ రావి హరీష్, ఆచంట మండలం వైస్ ఎంపీపీ ఎర్రగుంట్ల నాగరాజు, వీరవాసరం మండలం వైస్ ఎంపీపీ అడ్డాల రాము, సిద్ధాంతం గ్రామ సర్పంచ్ చింతపల్లి గంగ రాజు ( చంటి ), రామన్నపాలెం ఎంపిటిసి ముఖ మాట్ల కృష్ణ కాంత్, పాలమూరు ఎంపీటీసీ మాచిరెడ్డి నాగ దుర్గ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు చిటీనీడి రాము, మరో పంచాయతీ పాలకవర్గ సభ్యుడు కాకి ప్రభాకర్ రావు, పెనుగొండ మండలంలోని అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు, తదితర నాయకులు, కార్యకర్తలు వీరమహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.