హుస్నాబాద్ జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తీసుకున్న నిర్ణయంలో భాగంగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ల ఆదేశాల మేరకు జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ పాల్గొని కార్యకర్తలకు కిట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతీ కార్యకర్త కుటుంబానికి రక్షణ కల్పించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచనతో 5 లక్షల రూపాయల ప్రమాద భీమా పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్, యువజన విభాగం నాయకులు గాలిపెల్లి వినోద్, బండి శరత్, లక్కిరెడ్డి హిమవంత్, అభిలాష్, నిఖిల్, సుంకె రంజిత్ తదితరులు పాల్గొన్నారు.