కుప్పం జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కుప్పం: అధిష్టానం ఆదేశాల మేరకు శనివారం జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.హారి ప్రసాద్ మరియు కుప్పం నియోజకవర్గ ఇంచార్జి డా.వెంకటరమణ పర్యవేక్షణలో.. జిల్లా కార్యదర్శి కె.రామమూర్తి, జిల్లా సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప, ఆధ్వర్యంలో శాంతీపురం మండల అధ్యక్షులు కిషోర్ అధ్యక్షతన శాంతీపురం మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్ నందు క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లకు సన్మానం మరియు కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన మత్స్యకార విభాగ రాష్ట్ర కార్యదర్శి వామనమూర్తి, నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు నవీన్, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మధు, వీరమహీళ విభాగ కో-ఆర్డినేటర్ కుసుమ, గుడుపల్లి మండల అధ్యక్షులు ఆమీర్ గార్లతో పాటు శాంతీపురం మండల కమిటీ నాయకులైన బాలు, అరుణ్, వరదల సురేష్, కె.వి.ప్రసాద్, శ్రీకాంత్, హరి, గోవిందప్ప, సురేష్, పెరుమాళ్, ప్రశాంత్, కిరణ్, గుడుపల్లె & రామకుప్పం మండల నాయకులు మరియు జనసైనికులు హాజరయ్యారు.