డోన్ జనసేన ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

డోన్ నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవణ్ కళ్యాణ్ ఆదేశాలమేరకు క్రియాశీలక కిట్లను పంపిణీలో భాగంగా శనివారం డోన్ లో బాలు యాదవ్ మరియు బ్రహ్మ ఆధ్వర్యంలో జరిగిన డోన్ నియోజకవర్గం జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకెపాటి సుభాషిణి, జనసేన పార్టీ రాయలసీమ వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి హసీనా బేగం, జనసేవాదళ్ రాష్ట్ర నాయకులు చల్లా వరుణ్, జనసేన రాష్ట్ర ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీకాంత రెడ్డి, జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కర్నూలు జిల్లా కమిటీ సభ్యులు గడ్డం బ్రహ్మ, ఐటీ విభాగం డోన్ నియోజకవర్గం కార్యదర్శి చంద్రశేఖర్, వీరమహిళ శ్రీమతి చాముండేశ్వరి, క్రియాశీల సభ్యత్వ వాలంటీర్స్, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.