శ్రీకాకుళం జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

శ్రీకాకుళం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం మొదటిరోజైన శుక్రవారం జనసేన పార్టీ సెక్రెటరీ విజయ శంకర్, దుర్గ ప్రశాంతి, మోహన్, జాయింట్ సెక్రెటరీల ఆధ్వర్యంలో నరసన్నపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ సభ్యత్వాలు చేసిన పనుతుల జయరాం ను శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాయంలో శాలువలతో సత్కరించి, పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసిన ప్రశంసా పత్రం అందచేయటం జరిగింది. జయరాం చేతులమీదుగా మరికొందరు నియోజకవర్గ నాయకులు శంకర్, అప్పలస్వామి, సత్య లకు ఈ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జయరాం మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న జనసైనికులకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ కిట్లు శనివారం ఉదయం 9 గంటకు సౌబాగ్యా కళ్యాణమండపంలో అందచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా చైతన్య, రామ్మోహన్, విశ్వక్, దాసరి రాజు, కనిటికిరన్ మరియు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.