జనసేన ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

వేమూరు నియోజకవర్గం: నూతన సంవత్సరం సందర్బంగా వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం, మండూరు గ్రామం నందు చుండూరు మండల ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి మహేష్ నేతృత్వంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఉషా రాజేష్ పాల్గొని నూతన సంవత్సర కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకి, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చావలి గ్రామ సర్పంచ్ విష్ణు మొలకల శ్రీనివాసరావు, వేమూరు మండల జనసేన ఉపాధ్యాయులు దాది సీతారామయ్య, జనసేన సీనియర్ నాయకుడు వగోలు రమేష్, జిల్లా కార్యదర్శి చేబ్రోలు బోడియ్య, యాసం జగదీశ్, కుచ్చలపాడు గ్రామ అధ్యక్షుడు తిరుమల రావు, దేవిరెడ్డి సుబ్బయ్య, బుల్లిబాబు, యస్వంత్, గోపి, సాయి బాలాజీ, శివ కృష్ణ, రెడ్డి శివ కోటేశ్వరరావు, రెడ్డి వెంకటేశ్వర్లు, రెడ్డి అమ్మయ్య, అంజయ్య, దేవిరెడ్డి పాములు, లక్ష్మణ్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.