శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవాల్లో మజ్జిగ పంపిణీ

కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, ఒద్యారం గ్రామంలోని గుట్టపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు అయిన పండుగ గగన్ కుమార్ మాతృమూర్తి కీ.శే పండుగ భాగ్యలక్ష్మి జ్ఞాపకార్థం మజ్జిగ ప్యాకెట్లను గగన్ కుమార్ ఆహ్వానం మేరకు సర్పంచ్ ములుకుంట్ల సంపత్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు సావనపెల్లి ప్రశాంత్, శివ కుమార్, కవ్వంపెల్లి హరీష్, నరిగే శివ కుమార్, మోతే చందర్, చేను పోచయ్య మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.