పొన్నలూరు మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో ఆదివారం కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో.. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు కొండేపి నియోజకవర్గం నాయకులు మేడా రమేష్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి బీమా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడా రమేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి క్రియాశీలక సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన ఏకైక నాయకుడు. కొండేపి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చిన వాళ్లే, రోజు రోజుకి పొన్నలూరు మండలంలో జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతూ వస్తుంది. మార్పు మొదలైంది 2024 లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు అని రమేష్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ సభ్యత్వం అనేది మనకి మరియు మన కుటుంబానికి ఎంతో భరోసాను కలిగిస్తుందని.. మార్పు మొదలైంది అని మనోజ్ అన్నారు.