జనసేన ఆధ్వర్యంలో వరద బాధితులకు చికెన్ బిర్యానీ పంపిణీ

ముమ్మిడివరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాలలో పర్యటనలో భాగంగా సోమవారం ముమ్మిడివరం, ఐ పోలవరం మండలంలో జనసేన పీఏసీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో వరదప్రభావిత గ్రామాలైన సలాది వారి పాలెం, శేరిలంక కమిని, గురజాపు లంక, కొత్తలంక, ఎదుర్లంక, చింతావనిరేవు, కర్రీవానిరేవు, గాడిలంక ముంపుబాదిత రైతులకు 3860 బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంఛార్జి పితాని బాలకృష్ణ, గ్లోబల్ ఎన్ ఆర్ ఐ గ్రూప్,(20000) మరియు జనసేన నాయకులు సహకారంతో ఇంటింటికీ తిరిగి బిర్యానీ ప్యాకెట్లు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వారితో జనసేన నాయకులు ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్యం శెట్టి పురుషోత్తం, గోదశి పుండరీష్గ, ముమ్మిడివరం మండల అధ్యక్షుడు గోలకోటి వెంకన్న బాబు, లంకలపల్లి జమీ జడ్పీ ఎంపీటీసీ, గుత్తుల వెంకన్న బాబు, మాదాల శ్రీధర్, బండారు వెంకన్న బాబు, రంబాల శంకర్, గిడ్డి రత్నశ్రీ, పాయసం సాయి పెన్నాడ శివ మణికంఠ మరియు జనసేన పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.