వి.ఆర్.ఏ ల సమ్మెకు జనసేన మద్దతు

నిర్మల్ జిల్లా, భైంసా పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు సొమవారం విఆర్ఎ లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విధులు భహిష్కరించి సమ్మె చేస్తున్నారు. వీరికి పూర్తి స్థాయి మద్దతు తెలియచేసిన జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు. వారు మాట్లాడుతూ తెలంగాణ లో గ్రామ రెవెన్యూ సహాయకులు దాదాపు ఈరవై మూడు వేల మంది వున్నారు. ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులుగా ఉంటూ సమగ్ర కుటుంబ సర్వే నుండి నేటి దళిత బందు వరకు అనేక ప్రభుత్వ సర్వేలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు పోవడంలో వి.ఆర్.ఏ లు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గతంలో అనేక రూపాల్లో శాంతియుతంగా పోరాటాలు చేసిన పట్టించు కోలేదు కాబట్టి సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకారం పేస్కెల్, వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్, తదితర డిమాండ్లను వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని యెడల ప్రభుత్వం దిగివచ్చే విధంగ అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తామని హెచ్చరించడం జరిగింది.