జనసేన క్రియాశీలక కార్యకర్తకు భీమా చెక్ పంపిణీ
కొత్తపేట: ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందిన ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామానికి చెందిన క్రియాశీలక కార్యకర్త దూలం దేవత నాగేంద్రకు వైద్యం నిమిత్తం శ్రీ పవన్ కళ్యాణ్ తరుపున పార్టీ మెడికల్ ఇన్సూరెన్స్ నుండి 31,000/- రూపాయలు చెక్కును శుక్రవారం నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ పడాల నాగలక్ష్మి అమ్మిరాజు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సోము శేఖర్, చెముడులంక ఎంపీటీసీ తమ్మన భాస్కర రావు, మండల నాయకులు సలాది జేపీ, నాగిరెడ్డి మహేష్, పడాల సూరిబాబు, దూలం శ్రీనివాస్, సురపురెడ్డి సాయి, వెలక్కాయల సాయి, అడబాల ఆది, దూలం విశ్వేశ్వరరావు, బండారు అబ్బులు, బండారు దుర్గాప్రసాద్, తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-27-at-8.31.53-PM-1024x576.jpeg)