నర్సంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

  • జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తెలంగాణ, నర్సంపేట నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతీ జనసేన పార్టీ కార్యకర్త భద్రత, భరోసా కోసం 50 వేల రూ. ప్రమాదభీమా, 5 లక్షల రూపాయల జీవితభీమాతో కూడిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం కార్యకర్తలకు అందజేయడం జరిగింది. ఈ సమావేశంలో శివ కోటి యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనివిధంగా జనసేన పార్టీ తన కార్యకర్తలకు అండగా 5 లక్షల రూపాయల భీమా ఇస్తున్నారని అన్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గంలో దాదాపు 300 మంది కార్యకర్తలు 500 రూపాయలు చెల్లించి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త నర్సంపేట నియోజవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేసేలా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు వంగ మధు, షేక్ హుస్సేన్, ఉడుగుల క్రాంతి, గంగుల రంజిత్, ప్రధాన కార్యదర్శులు ఓర్సు రాజేందర్, గాండ్ల అరుణ్, కార్యవర్గ సభ్యులు బొబ్బ పృథ్వీరాజ్, రొడ్డ శ్రీకాంత్, కొమ్ము రంజిత్, రాపోలు సురేష్, గద్దల కిరణ్, మిలాన్, లహరి, రణదీప్, సూర్య, రవి, భార్గవ, నితిన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.