మరువపల్లిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ మరువపల్లిలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కుమార్, పెనుగొండ మండల కన్వీనర్ మహేష్ ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యులు నాయకులు పర్యటించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న సభ్యులకు కిట్లు పంపిణీ చేసి గ్రామాల్లో ఉన్న సమస్యలు డ్రైనేజీ, సీసీ రోడ్లు వీధి లైట్స్ లాంటి సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిస్కారం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కుమార్, మండల కన్వీనర్, మహేష్, ఉపాధ్యక్షులు మంజునాథ్, సురేష్, నాయకులు రాజేష్, హరి, నాయక్, వెంకటరెడ్డిపల్లి ప్రదీప్, కార్యదర్శి, నారాయణ, సంయుక్త కార్యదర్శి, అజయ్, రాంపురం పంచాయతీ నాయకులు, బద్రి, ప్రసాద్, సురేష్, శ్రీనివాసులు, లోకేష్, నాగార్జున, జనార్దన్, ఓబులేసు, రమేష్, రాము, చంద్ర, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.