బాలసముద్రం గ్రామం నందు జనసేన పింఛన్ 2వ నెల పంపిణి

కదిరి, జనసేన పింఛన్ 2 వ నెల పంపిణి కార్యక్రమం కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం బాలసముద్రం గ్రామం నందు 1.రెడ్డెమ్మ, 2.సాలెమ్మ, 3.లక్ష్మమ్మ, 4.చాంద్ బాషా, 5.కుల్లాయప్ప లకు జనసేన పింఛన్ గా 310 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబాలు పింఛన్ కోసం గత 3 నెలలు 6 నెలలు ఆ పైన నుండి అప్ప్లై చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి పింఛన్ రావడంలేదు. అదిగో ఇదిగో అంటూ నెలలు గడుస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. గ్రామ, మండల ఆఫీసుల్లో అడిగితే పైనుండి డబ్బు రావడం లేదు, వచ్చే వరకు వేచి ఉండక తప్పదు అంటున్నారు. ఈ సమస్య ఒక్క గ్రామానికి సంబంధించింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ప్రభుత్వం చొరవ చూపించి ఈ సమస్యని పరిష్కరించాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని బాలసముద్రం ఎంపిటిసి అమర్ కార్తికేయ అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులకు కార్యకర్తలకు మరియు ప్రజలకు స్నేహితులకు, సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేష, అనిల్, నవీన్, ముబారక్, గణేష్, కిరణ్, మన్సూర్ పాల్గొన్నారు.