జనసేన ఆధ్వర్యంలో ప్రసాదం, పులిహోర, మజ్జిగ మరియు మినరల్ వాటర్ పంపిణీ

రంపచోడవరం, ఉగాది పర్వదినం సందర్భంగా వర రామచంద్రపురం మండలంలోని గుణంకొండ గుట్ట మీద వెలసిన ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రసాదం, పులిహోర, మజ్జిగ మరియు మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీనివాస్ రెడ్డి, ముంజపు సాయి, కెచ్చల పోషి, ఆదిత్య, నాగేంద్ర, సాగర్, నవీన్, నాగు, తేజ, అల్లు అర్జున్ అభిమానులు దుర్గేష్, ప్రభాస్ అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.