Kurnool: కృతజ్ఞతలు తెలిపిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు

సుగాలి ప్రీతి బాయి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 5 సెంట్లు ఇంటి స్థలం పట్టాతో పాటు 5 ఎకరాల వ్యవసాయ సాగు భూమి పట్టాను అందజేసిన కర్నూల్ జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు.

ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలు అయిన సుగాలి ప్రీతి బాయ్ తండ్రి రాజు నాయక్ కు రెవెన్యూ శాఖలో ఉద్యోగం కల్పించారు.

ఈ సందర్భంగా కల్లూరు గ్రామంలో 5 సెంట్లు ఇంటి స్థలం పట్టాతో పాటు దీన్నే దేవరపాడు గ్రామంలో ఐదు ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఈ పోరాటంలో తన వెంట ఉంటూ తనకు తన కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి సుగాలి ప్రీతి బాయి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌గారి ఆశయానికి వెన్నంటి నిలిచిన కర్నూలు జనసేననాయకుడు శ్రీ ఆర్షద్ SMD కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, డి.ఆర్.ఓ. పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.