అనంతపురం అర్బన్ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-19-at-5.32.40-PM-1024x466.jpeg)
అనంతపురం నగరంలోని స్థానిక రాంనగర్ కార్యాలయంనందు అర్బన్ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ మాట్లాడుతూ ఈ నెల 21వ తారీఖున అనంతపురంకు విచ్చేయుచున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌ. శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటన గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఆయన పర్యటన విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం అలాగే పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.