ముస్లిం సోదరీమణులకు డి.ఎం.ఆర్ శేఖర్ నూతన సంవత్సర కానుకలు

అమలాపురం: క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా అమలాపురం పట్టణంలో ముస్లిం సోదరీమణులకు అమలాపురం జనసేన పార్టీ పార్లమెంటు ఇంచార్జ్ డి.ఎం.ఆర్ శేఖర్ యొక్క తల్లిదండ్రుల పేరు మీద పేద మహిళలకు, వృద్దులకు దాదాపుగా 75 మందికి చీరలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లింగోలు పండు, ముస్లిం మైనారిటీ సభ్యులు కరిముల్ల బాబా, షఫీ ఉల్లా, బషీర్, పోలిశెట్టి బాబులు, మరియు నాయకులు నల్లా వెంకటేశ్వరరావు, గంధం శ్రీనివాస్, పాలురి నారాయణ స్వామి, కొప్పుల నాగ మానస, చేట్ల మంగతాయారు, డి ఎస్ ఎన్ కుమార్, వర్రే శేషు, గట్టెం వీరు, పోలిశెట్టి పవన్ మహేష్, నల్లా దుర్గారావు, పేదమల్లు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.