ఏలూరు జనసేన పార్టీలోకి భారీ చేరికలు..

ఏలూరు నియోజకవర్గంలోని తంగెళ్ళమూడి 50 వ డివిజన్ ఎం.ఆర్.సీ కాలనీలో డివిజన్ ఇంచార్జీ తుమ్మపాల రామకృష్ణ, మడుగుల మాణిక్యాలరావు ఆధ్వర్యంలో మంగళవారం టిడిపి, వైసీపీ పార్టీకీ చెందిన 60 మంది కార్యకర్తలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి.. పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరడం జరిగింది.. వీరిని రెడ్డి అప్పల నాయుడు జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.. అనంతరం 50 వ డివిజన్ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా కార్యదర్శి తేజస్విని, సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, వీర మహిళ కావూరి వాణి, నాయకులు బుధ్ధా నాగేశ్వరరావు, నిమ్మల శ్రీను జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.