ఫిల్మ్ ఇండస్ట్రీని బద్నాం చేయొద్దు: జయాబచ్చన్‌

డ్రగ్స్ వ్యవహారాన్నిచిత్రసీమకు ముడి పెడుతూ పదే పదే విమర్శలు రావడంపై ఎంపీ జయాబచ్చన్ తీవ్ర అసహనం ప్రకటించారు. డ్రగ్స్  వ్యవహారo అడ్డుపెట్టుకుని చిత్రసీమను తప్పుపట్టడం సరికాదు అని ఆమె అన్నారు. ఈ రోజు  ఆమె రాజ్యసభలో మాట్లాడారు. చిత్రసీమకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలన్నారు. కొందరి కోసం మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని బద్నాం చేయడం సరికాదు అని ఆమె అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటులు మన దగ్గర ఉన్నారన్నారు. నిన్న లోక్‌సభలో ఓ ఎంపీ సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడడం శోచనీయమని, చిత్రసీమలో పనిచేసిన ఆ వ్యక్తి .. ఆ ఇండస్ట్రీ గురించి అలా మాట్లాడటం సిగ్గుచేటు అని జయాబచ్చన్ తెలిపారు. అంతకముందు జయా బచ్చన్ జీరో అవర్ నోటీసు ఇచ్చారు. చిత్రసీమను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఆమె ఆరోపించారు. జీరో అవర్‌లో దీనిపై మాట్లాడాలన్నారు.