ఆర్మీ సైనికుడిగా దేశ సేవలందించిన జనసైనికునికి డాక్టరేట్ పురస్కారం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-05-at-6.35.34-PM-1024x1024.jpeg)
విశాఖ, 16 సంవత్సరాలు ఆర్మీ సైనికుడిగా దేశ సేవ చేసి పదవి విరమణ పొంది, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం తరఫున బాలల హక్కుల పరిరక్షణకు అలాగే దేశానికి వైజాగ్ యువత దేశ సేవ చేసే విధంగా ఎంతో మంది యువతను గత ఐదు సంవత్సరాలుగా నిత్య సేవకుడిగా రోజు గంటపాటు తన అమూల్యమైన సమయాన్ని ఉచిత శిక్షణకు కేటాయిస్తూ ఆయన చేస్తున్న కృషి దేశం పట్ల, ఊరు పట్ల గౌరవంతో కూడిన బాధ్యతను నిర్వర్తిస్తున్న శ్రీ రౌతు గోవిందరావుగారికి గౌరవ డాక్టరేట్ రావడం జరిగింది. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు.