ఎల్.ఎన్. డి పేట జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రం

ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, పోలవరం మండలం ఎల్.ఎన్. డి పేట గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి చలివేంద్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పోలవరం మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటి సభ్యులు ఆటపాకల వెనకటేశ్వర రావు (ఏ.వి), జనసేన మండల కార్యదర్శి శీలం వంశీ, ఎల్ ఎన్ డి పేట గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు తెలే నరసింహమూర్తి, ఉపాధ్యక్షుడు కట్టా, ప్రధాన కార్యదర్శి పూనకం వెంకన్న, పులిబోయిన శ్రీను మరియు జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.