కరోనా విజృంభిస్తున్నసమయంలో స్కూళ్లు తెరిచి పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దు: చంద్రబాబు

సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు ఏపీ సర్కారు సిద్దం అవుతుంది. ఈ నేపధ్యంలో విపక్ష నేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో స్కూళ్లు తెరిచి పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. 7 జిల్లాల్లో 70 శాతం కేసులు నమోదవడం ఏపీలో కరోనా తీవ్రతకు నిదర్శనమని పేర్కొన్నారు. నిత్యం 10 వేల కొత్త కేసులు, 100 మంది చనిపోతున్నా జగన్ లో చలనంలేదని చంద్రబాబు మండిపడ్డారు. సంక్షోభం వచ్చినప్పుడే పాలకుల సమర్థత బయటపడుతుందని తెలిపారు. టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.