ఇసుకను అమ్ముకునే అంత శ్రద్ధ శిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిపై ఉండదా: గాదె

పెదకూరపాడు నియోజకవర్గం, నాగవరం గ్రామం మీదుగా వెళ్లే రోడ్ల పరిస్థితి మరీ ఎంత ధీనస్థితిలో ఉన్నాయో ఒక్కసారి చూడండి అని జనసేనపార్టీ జిల్లా అద్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పెదకూరపాడు ఎమ్మెల్యేని ప్రశ్నించడం జరిగింది. కృష్ణానది ఇసుకను అమ్ముకున్న శ్రద్ధ నాగవరం నుండి దొడ్లేరు వెళ్లే రోడ్ లోని శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిని పునః నిర్మించడం మీద చూపండి. మీ అక్రమ ఇసుక లారీలు పడిపోయే స్థితిలో ఉన్న ఈ బ్రిడ్జిపై నుండే తరలిస్తున్నారు. కావున దయచేసి కొంచెం శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలపై కొంచెం శ్రద్ధ చూపించాలని కోరుతున్నానని అన్నారు.