ఇంటింటా క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమం

శ్రీకాళహస్తి: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ నందు ఇంటింటికీ పర్యటించి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది, అలానే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు, సి సి రోడ్లు, పారిశుధ్యం సమస్యలతో సతమతం అవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ శివ కుమార్, నాయకులు రవి కుమార్ రెడ్డి, సురేష్, బాలాజీ, జనసైనికులు తేజ కుమార్, ప్రకాష్, కృష్ణ తేజ, ద్రువ్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.