సత్తెనపల్లి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం: బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లిలో రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదుగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఇంటింటికి పవనన్న బాట కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మొక్కపాడు గ్రామ జనసైనికులు జనసేన పార్టీ నాయకులకు, అప్పారావు కు ఘనంగా స్వాగతం పలికారు. మొదటిగా గ్రామంలో ఇంటింటికి పవనన్న బాట కార్యక్రమాన్ని నిర్వహించి, తరువాత జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అనంతరం బొర్రా వెంకట్ అప్పారావు మాట్లాడుతూ.. రాబోయేది జనసేన ప్రభుత్వం అని, జనసేన పార్టీ రోజురోజుకీ బలపడుతుందని, అందుకు గ్రామ గ్రామాన ఎగురుతున్న జనసేన పార్టీ జెండాలు నిదర్శనమని తెలియజేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారి ప్రారంభించబోయే 3వ దశ వారాహి యాత్రతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయని, గత రెండు రోజుల నుండి జగనన్న కాలనీలను సందర్శించడం జరిగిందని రాబోయే జనసేన ప్రభుత్వం ద్వారా ప్రజారంజక పరిపాలన అందిస్తామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన రాజుపాలెం మండల నాయకులను, మొక్కపాడు గ్రామ నాయకులను జన సైనికులను అభినందించారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా ఉండి జనసేన పార్టీ అభివృద్ధి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, సత్తనపల్లి వార్డు కౌన్సిలర్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు, నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మండల కమిటీ వారు, గ్రామ కమిటీ వారు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగినది.