ఇంటింటా క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమం

శ్రీకాళహస్తి: క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా తొట్టంబేడు మండలం, పెద్ద కనపర్తి, పెద్ద కనపర్తి హరిజనవాడ గ్రామంలో ఇంటింటికీ పర్యటించి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది, అలానే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంపు, డ్రైనేజీ కాలువలు, సి సి రోడ్లు, పారిశుధ్యం సమస్యలతో సతమతం అవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, జనసైనికులు వెంకటేష్, శీను తదితరులు పాల్గొన్నారు.