ఖమ్మం కార్పొరేషన్లో మిరియాల రామకృష్ణ ఇంటింటి ప్రచారం
తెలంగాణ, బిజెపి బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల రామకృష్ణ బుధవారం డోర్ టు డోర్ ప్రచార ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా జనసేన ఎన్నికల ప్రచారం ఖమ్మం కార్పొరేషన్ లోని రామనగుట్ట 57, డివిజన్ లలో నిర్వహించారు బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల రామకృష్ణ ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-15-at-21.02.44.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-15-at-21.02.44-1.jpeg)