తానేం గ్రామంలో ఇన్చార్జి పేడాడ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన

ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం, తానేం గ్రామంలో జనసేన పార్టీ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఆ గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు, దోమలు, రోగాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికి ప్రభుత్వం కేటాయించిన స్థలాలను ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండల జనసేన పార్టీ నాయకులు చిన్నమనాయుడు, బాబురావు, సురేష్, సూర్య, రమణ, గోపి, సిమ్మి నాయుడు, చిన్న, రామకృష్ణ, సింహాచలం మరియు పెద్ద ఎత్తున గ్రామ జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.