టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి: జనసేన డిమాండ్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బెక్కం జనార్ధన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనార్ధన్ మాట్లాడుతూ టీఎస్పీఎస్ కమిటీ సభ్యుల్లో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా సభ్యులను నియమించి రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించారు అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ తన విచక్షణ అధికారాలు ఉపయోగించి టిఎస్పిఎస్సి చైర్మన్, సెక్రెటరీలను తక్షణమే విధులనుండి తొలగించాలి అన్నారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ గేట్ పర్యవేక్షణలో విచారణ జరిపించాలి కోరారు. సీట్ రాష్ట్ర ప్రభుత్వ జేబు సంస్థలా మారిందని దుయ్యబట్టారు. టీఎస్పీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగుల అందరికీ నిరుద్యోగ భృతిని కల్పించాలి అని అన్నారు. కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టులు చేయడమే కాకుండా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. అలాగే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం విచారణకు రాష్ట్ర క్యాబినెట్ అంతా ఢిల్లీకి తరలి వెళ్లారు కాని రాష్ట్రంలోని నిరుద్యోగులను గాలికి వదిలేశారు అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు బొల్లి రాము కార్యకర్తలు బేక్కం సాయన్న బాలు, బొల్లి లక్ష్మణ్, దరూరి వంశీ, సనిగరపు రాకేష్ చింత సుధీర్ పలువరు కార్యకర్తలు పాల్గొన్నారు.