డా. లక్ష్మణ్ కి హృదయపూర్వక అభినందనలు
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్తున్న సీనియర్ నాయకులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ గారికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన లక్ష్మణ్ గారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన సేవలు ఆయన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాయి. సామాజిక న్యాయం మాటలకు, రాజకీయ అవసరాలకు పరిమితం కాకుండా ఉండాలంటే శ్రీ లక్ష్మణ్ గారి లాంటి ఉన్నత విద్యావంతులు పెద్దల సభలో ఉండాలి. లక్ష్మణ్ గారు ఆ దిశగా తన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తారనే విశ్వాసం ఉంది. లక్ష్మణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
![](https://janasenanewssletter1.blob.core.windows.net/images/a972d33e-7da3-4666-b237-2bf02c9c9181.jpeg)