జనసేన శ్రేణులపై అక్రమ కేసుల వ్యవహారం రాష్ట్ర డీజీపీ దృష్టికి

  పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని బృందం కలవాలని నిర్ణయం
జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురి చేస్తున్న తీరుపై పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని బృందం రాష్ట్ర డీజీపీ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారితో చర్చించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర డీజీపీ అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఈ సందర్భంగా తెలియచేస్తామని లేఖలో పేర్కొన్నారు. తేదీ, సమయం ఇవ్వాలని డీజీపీని కోరారు.