మృతుని కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సహాయం

దక్షిణ నియోజకవర్గం 41 వ వార్డులో మృతి చెందిన బుర్ర జయరాజు కుటుంబానికి జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు, 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆర్థిక సహాయం అందజేశారు. చనిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే డాక్టర్ కందుల నాగరాజు స్పందించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కుటుంబానికి అండగా నిలవడం తన బాధ్యత అని చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తను అందుబాటులో ఉంటానని తెలిపారు. మంచి పనులకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఎటువంటి స్వలాభ పేక్ష లేకుండా సాయం చేయడం మాత్రమే తనకు తెలుసని చెప్పారు. ఈ కార్యక్రమంలో 41 వ వార్డు జనసేన నాయకులు అంతోని శేఖర్, దేవి, ప్రసాద్, బద్రీనాథ్, కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.