దక్షిణంలో డాక్టర్ కందుల స్ఫూర్తిదాయక సేవలు

వైజాగ్ సౌత్: దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని వార్డులలో తన పరిధి మేరకు సేవలను అందిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం దక్షణ నియోజకవర్గం 30వ వార్డు రెల్లివీధికి చెందిన నవ వధువు యమునకు పట్టుచీర, పసుపు కుంకుమ, బంగారు తాళిబొట్టును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగుతున్నాయని వెల్లడించారు. నవ వధువులకు, పుష్పవతి అయిన వారికి ఇతోదికంగా తన సేవలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల నియోజకవర్గంలో పలువురు నవ వధువులకు పట్టు చీరలను, బంగారు తాళిబొట్టు, పసుపు కుంకుమలను అందజేసినట్లు వెల్లడించారు. తాను బ్రతికినంత కాలం ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉసిరికాయల యజ్ఞ శ్రీ (కార్పొరేటర్ అభ్యర్థి)30వ వార్డు జనసేన నాయకులు, జోగిరాజు, శ్రీహరి, ప్రకాష్, చిన్నారావు, రాము, రాజు, నాగేంద్ర, డాల్ఫీన్ శంకర్, అప్పారావు, వర, కుమారి, కె ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కందుల కేదార్నాథ్, వార్డ్ ఇంచార్జ్ కందుల బద్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.