జంతర్ మంతర్ వేదికగా జరిగిన అమరావతి రైతుల ధర్నాలో పాల్గొన్న డా.పసుపులేటి

ఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి రైతులకు మద్దతుగా జనసేన పార్టీ తరపున పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పక్ష పాతి పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతులకి మద్దతుగా న్యాయస్థానం – దేవస్థానం మహా పాద యాత్ర కు, మరియు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా రైతుల తరపున ఎప్పుడూ తన మద్దతు ఇస్తూనే ఉంటారని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా అమరావతికే జనసేన పార్టీ మద్దతు తెలుపుతుందిని.. రైతుని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు కూలిపోతాయని ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా జరిగిన అమరావతి రైతుల ధర్నా కార్యక్రమంలో డా.పసుపులేటి హరిప్రసాద్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *